Mahanaadu-Logo-PNG-Large

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-మంగళగిరి పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు
-నివాళుర్పించిన నాయకులు, కార్యకర్తలు

మంగళగిరి, మహానాడు: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం సభలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా తిరుగులేని మనిషిగా.. వెరసి ఎన్టీఆర్‌ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు, యుగపురుషుడని కొనియాడారు.

దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడని ప్రశంసించా రు. తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకా లకు శ్రీకారం చుట్టిన మహానుభావుడిగా ఆయన కీర్తి అజరామరంగా నిలిచిపోతుందన్నారు. ప్రతి తెలుగుబిడ్డ గుండెలో ఎన్టీఆర్‌ శాశ్వతంగా నిలిచిపో తారని నివాళులర్పించారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కారణజన్ముడు, మరణం లేని జననం నందమూరి తారక రామారావుగారిదని కొనియాడారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.