గుంటూరులో అత్యధిక మెజార్టీపై బాబు ప్రశంస
గుంటూరు: ‘అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమతో రాష్ట్రంలో మరో అధ్యాయాన్ని సృష్టించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవా రం ఆయన నివాసంలో గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజా తీర్పు ఒక ప్రభంజనంలా వచ్చిందని, అభివృద్ధిని సాధించగలరన్న నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఇంతటి ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ పరిధిలో భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసానిని చంద్రబాబు నాయుడు అభినందించారు. ఓటర్లకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం చంద్రబాబుతో కలిసి పెమ్మసాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.