Mahanaadu-Logo-PNG-Large

రాజీనామా చేస్తేనే…మళ్లీ వాలంటీర్లుగా నియామకం

-లేకుంటే అధికారం చేపట్టాక కొనసాగించం
-టెక్కలి వైసీసీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యలు

శ్రీకాకుళం, మహానాడు: రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పని చేస్తారో వారే తమ వాలంటీర్లు అంటూ టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తారో వారే తిరిగి అధికా రంలోకి వచ్చాక మళ్లీ కొనసాగుతారని తెలిపారు. రాజీనామా చేయని వాళ్లు మనకు పనిచేయరని అర్థం చేసుకోవాలని, ఇప్పటివరకు రాజీనామా చేయని వాలంటీర్లు తక్షణమే రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ పది రోజులు ప్రచారాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దువ్వాడ వ్యాఖ్యలతో పెద్దఎత్తున దుమారం రేగుతోంది. వాలంటీర్లను రాజకీయాలకు వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.