న్యూఢిల్లీ: అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఎర్రచందన స్మగ్లర్ బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని చాపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బయట తిరిగాడు.
గతంలో నమోదైన ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈయన పుల్లంపేటకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి సమీప బంధువు కావడం విశేషం. గత ఐదేళ్లు భారీగా ఎర్రచందనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు బాబుల్ రెడ్డిపైన ఆరోపణలు ఉన్నాయి.