కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు, కుండీల ధ్వంసం
యజమానితో కాళ్లు పట్టించుకున్న వైనం
గుంటూరు : హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానిపై జనసైనికులు దాడి చేసి కాళ్లు పట్టించుకున్న ఘటన గుంటూరు లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జనసైనికులు హాస్టల్ మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు. అంతేకాకుం డా హాస్టల్లోని అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు.