Mahanaadu-Logo-PNG-Large

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయండి

ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు

గుంటూరు, మహానాడు :  కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకులు పని చేస్తున్నారన్నారు. వారిని రెగ్యులరైజేషన్ చేయటానికి ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ని కలిసి విన్నవించారు. ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు వెంట కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు ఉన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యువల్ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఉంది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఈ ఫైల్ కు ఆమోదం తెలుపుతామని కోన శశిధర్ చెప్పారు.