ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట

-టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది.

లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిరమేష్‌కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది.