Mahanaadu-Logo-PNG-Large

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నివేదిక

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అందుకోసం తెలంగాణ, కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధిలోపు ప్రయాణానికి అనుమతిస్తారా? లేక లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అన్నది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించనుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.