చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌:  ఏపీలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండిరగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణం లో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్‌ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విప్‌ రాంచంద్ర నాయక్‌, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.