Mahanaadu-Logo-PNG-Large

బాబు కోసం కాన్వాయ్‌ వెంట పరుగులు

కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
మదనపల్లికి చెందిన మహిళగా గుర్తింపు
కష్టం ఫలించి సీఎం అయ్యారంటూ ఆనందం
వైద్యసాయం చేయాలని పార్టీ నేతలకు సూచన

విజయవాడ: కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్‌లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన బాబు వెంటనే కాన్వాయ్‌ను ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. సెక్యూరిటీ అడ్డుకోబోయినా వారించారు. తనది మదనపల్లి అని… తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ మీపై అభిమానంతో చూడడా నికి వచ్చాను అని చెప్పింది. మా కష్టం ఫలించి మీరు సీఎం అయ్యారు సార్‌… ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ నమస్కారం చేయబోగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని చెప్పగా…ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.