అదే వేగం …అదే పరుగు …అదే నడక..

• నెలరోజుల ‘నారా ‘పాలన
• ఒక నెల… వంద అడుగులు!

• నెలరోజుల పాలన పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం
• మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు
• అనుభవం ముద్ర కనిపించింది…ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది
• ప్రజల జీవితాల్లో వెలుగు…. ప్రభుత్వం పై నమ్మకం….
•రాష్ట్రంలో అశాంతి లేదు…..అధికార అహంకారానికి చోటు లేదు….
• ఆకృత్యాలకు స్థానం లేదు…హంగామా, హడావుడి లేనే లేవు.
• సింపుల్ గవర్నమెంట్….ఎఫెక్టివ్ గవర్నెన్స్ – CBN 4.0లో మరింత దూకుడు
• అధికారం అంటే పదవి కాదు… బాధ్యత అని చాటిని నిజమైన ప్రజా ప్రభుత్వం

నెలరోజుల పాలనలో ఎపిలో చంద్రోదయం
* అయిదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు.
* నెలరోజుల పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి….ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
* నెలరోజుల పాలన పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం…మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు వేసింది.
* చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది…ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది.ప్రజల జీవితాల్లో
వెలుగు….ప్రభుత్వం పై నమ్మకం కనిపిస్తోంది. వ్యవస్థలను గాడిన పెడతున్నారు…. ప్రక్షాళణా మొదలు పెట్టారు. రాష్ట్రంలో అశాంతి లేదు….అధికార అహంకారానికి చోటు లేదు… ఆకృత్యాలకు స్థానం లేదు…హంగామా, హడావుడి లేనే లేవు. సింపుల్ గవర్నమెంట్….ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తోంది.
* పరదాలు, బారికేట్లు, చెట్లు కొట్టేయడాలు లేనే లేవు. CBN 4.0లో మరింత దూకుడుగా చంద్రబాబు నాయుడు. అధికారం అంటే పదవి కాదు… బాధ్యత అని చాటిని నిజమైన ప్రజా ప్రభుత్వం లా నెలరోజుల పాలన.
* బాధ్యతలు చేపట్టిన తొలిరోజే అయిదు కీలకఫైళ్లపై సంతకాలు.
* మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.3 వేల నుండి పెన్షన్ ను ఒకేసారి రూ.4 వేలకు పెంపు, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన పై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు. అనంతరం కేబినెట్ లోనూ ఆ ఐదు అంశాలకు ఆమోదం.
•బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే రూ.4408 కోట్లు పింఛన్ల పంపిణీతో సంక్షేమ పండుగకు శ్రీకారం.
* ఆగస్టులో 183 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం.

* రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు అందజేతకు సన్నాహాలు.
* 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలివారంలోనే పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన.
* రెండో పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు. విధ్వంసాన్ని ప్రజలకు వివరించిన చంద్రబాబు.
అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ఇష్టపడని సీఎం. ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం. రచ్చబండ మీద కూర్చుని పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సిఎం.
* మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్విన్ కు నిబంధనల పేరుతో పెన్షన్ తీసేసిన గత ప్రభుత్వం. నాడు దీనిపై ట్విట్టర్ లో సెల్ఫీ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తుంచుకుని జిల్లాలోనే మొదటి పెన్షన్ ను దివ్యాంగురాలై సీమా ఫర్విన్ కు అందేలా అధికారులకు ఆదేశాలు.
* కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించిన సీఎం. దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి రూ.5 లక్షల సాయం అందించడంతో పాటు నెలకు రూ.15 వేల పెన్షన్ మంజూరు.
* ఎక్కడికైనా తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో గంటల పాటు ట్రాఫిక్ నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని
అధికారులకు సూచనలు.
* హడావుడి లేని సింపుల్ గవర్నమెంట్ ఉండాలి….పాలన ఎఫెక్టివ్ గా ఉండాలి అనే నినాదం.
* గాడి తప్పిన శాంతిభద్రతలపైనా సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.
* బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెంలో మహిళ అత్యాచారం, హత్య జరిగిన వెంటనే స్పందించిన సిఎం.నిందితులను 48 గంటల్లోనే పట్టుకోవాలని హోమంత్రి, డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన సీఎం. 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. అనకాపల్లిలో బాలికను చంపిన దుర్మార్గుడు అరెస్టు భయంతో ఆత్మహత్య. పోలీసింగ్ లో కనిపిస్తున్న మార్పు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో సిఎంవో చొరవతో రూ.50 లక్షల పరిహారం.

 ఢిల్లీ పర్యటన సక్సెస్
* రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల వివరణ.
* రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుండి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం.
* గత సిఎం ఢిల్లీ పర్యటన సొంత పనుల కోసం…నేటి సిఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాలకోసం.
* మరోవైపు వైసీపీ విధ్వంసంపై శ్వేత పత్రాల విడదల. గత ప్రభుత్వంలో విధ్వంసమైన 7 ముఖ్య శాఖలపై శ్వేతపత్రాలు విడుదల. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల.
·రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగులో సమస్యల పరిష్కారంపైనా తొలి అడుగు వేసిన చంద్రబాబు.
* రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు సీఎం రేవంత్ కు ఆహ్వానం. చంద్రబాబు ఆహ్వానంపై స్పందించి ప్రజాభవన్ లో ఇరు ముఖ్యమంత్రులు సమావేశం.

అన్నట్లుగానే ఉచిత ఇసుక:-
ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించిన సీఎం. గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో కుదేలైన నిర్మాణ రంగం. ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగానికి ఊతమిచ్చిన చంద్రబాబు. కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుక పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.

పెట్టుబడులపై ముందడుగు:-
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలువురు పారిశ్రామిక వేత్తలు భేటీ.
* బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధులు భేటీ. రూ.60 వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు. విన్ ఫాస్ట్ అనే ఆటోమెబైల్ సంస్థతోను చర్చలు. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు.
* పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కలిగించేలా చర్యలు. ఇప్పటికే మొదలైన స్పందన.
* ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై ప్రత్యేకదృష్టి, 2026కు ఎయిర్ పోర్టు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు.
వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్, పలు అంశాలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్షలు. మంత్రులను ఉరుకులు పెట్టిస్తున్న సిఎం.

పార్టీ క్యాడర్ కు భరోసా:-
* పార్టీ కోసం పోరాటం చేసిన క్యాడర్ కు భరోసా. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు.
* పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు నిచ్చేందుకు విస్తృత కసరత్తు. నామినేటెడ్ పదవులపైనా కసరత్తు మొదలు పెట్టిన సిఎం చంద్రబాబు.
సామాజిక న్యాయానికి పెద్దపీట. బిసిలకు పార్టీలో గౌరవం. రాష్ట్ర అధ్యక్షుడిగా, స్పీకర్ గా బిసి నేతలు.
* మొదటి మూడు నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం. పార్టీ కేంద్ర కార్యాలయం, గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు.
* అక్రమంగా కడుతున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కూటమి ప్రభుత్వం.
* జగన్ తో అంటకాగిన అధికారులను దూరంగా పెడుతున్న సిఎం. మద్యం, ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో చర్యలకు శ్రీకారం. దర్యాప్తు మొదలు. గతానికి భిన్నంగా వేగవంతమైన నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీఎం.