Mahanaadu-Logo-PNG-Large

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం, మహానాడు: భద్రాచలం వద్ద మరోసారి రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మొన్నటిదాకా నీటిమట్టం 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ 47 అడుగులకు తగ్గింది. మళ్ళీ  క్రమంగా పెరుగుతూ వస్తోంది. 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా 51 అడుగులకు చేరింది.

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రాచలం దిగువున ఉన్న విలీన మండలాల్లో అనేక గ్రామాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి.