Mahanaadu-Logo-PNG-Large

గురజాల, మాచర్లలో సిట్‌ బృందం పర్యటన

కారంపూడి స్టేషన్‌లో రికార్డుల పరిశీలన
హింసాత్మక ఘటనలు, అల్లర్లపై ఆరా

గుంటూరు, మహానాడు : గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఆదివారం సిట్‌ అధికారుల బృందం పర్యటించింది. ఎన్నికల ముందు, అనంతరం హింసాత్మక ఘటనల నేపథ్యంలో విచారణ కోసం వారు వచ్చారు. పల్నాడు జిల్లా కారంపూడి పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కారంపూడి మండలంలో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లపై నమోదైన కేసు వివరాలను పరిశీలించారు. కారంపూడి సీఐ నారాయణ స్వామి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గంలో సుమారుగా 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. దాచేపల్లి, సత్తెనపల్లి నియోజవర్గాల్లో కూడా సిట్‌ అధికారుల బృందం పర్యటించనుంది.