Mahanaadu-Logo-PNG-Large

బీజేపీతో సుస్థిరమైన పాలన

-తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభాలకు దూరం
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తార్నాక, మహానాడు: బీజేపీతోనే దేశంలో సుస్థిరమన పాలన సాధ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తార్నాక కాలనీ అసోసియేషన్‌ వాసుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కార్యకర్తగానే కొనసాగాను. మోదీ నాయకత్వంలో కేంద్రమంత్రిగా విధులు నిర్వర్తిస్తూ ఆర్టికల్‌ 370 రద్దులో భాగం అయ్యా ను. సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వంతో తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం వంటి వాటి నుంచి బయటపడ్డాం. 2014 తర్వాత మోదీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. టెర్రరిజంపై జీరో టాలరెన్స్‌ విధానంతో ముందుకు వెళుతున్నాం. మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయాలకు అతీతంగా దేశం మరింత ముందుకు వెళుతుంది. ప్రతిఒక్కరూ పార్టీలకు అతీతంగా దేశం కోసం ఓటింగ్‌లో పాల్గొనడమే కాకుండా తెలిసిన వాళ్లకి ఫోన్‌ చేసి ఓటేయమని చెప్పాలని కోరారు. బీజేపీ, మోదీని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.