– ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
విజయవాడ, మహానాడు: ఓల్డ్ రాజరాజేశ్వరి పేట లో వరద మంపులో ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి బాధితుల ఇంటికి వెళ్ళి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ళల్లోకి నీరు ఎక్కడివరకూ ప్రవేశించిందో స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు వరద నీటిలో పలు ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, మంచినీరు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం…. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉంది. రేపు సాయంత్రానికి ఓల్డ్ ఆర్.ఆర్ పేట లో నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల మోటార్ల తో తోడి వేస్తున్నాం. వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి.