Mahanaadu-Logo-PNG-Large

థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు: ప్రధాని మోదీ

అమరావతి: తనకు స్వాగతం చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు గారూ.. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని రాజమండ్రికి వెళుతున్నా. సాయంత్రం అనకాపల్లి ర్యాలీలో పాల్గొంటా. ఏపీ మొత్తం ఎన్డీయేతోనే ఉంది అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జోరుపై మరో ట్వీట్‌

ప్రధాని మోదీ ఏపీ రాజకీయాలపై మరో ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ గాలి వీస్తోంది. కూటమికి లభిస్తున్న ప్రజాదరణతో ప్రత్యర్థులకు నిద్రపట్టట్లేదు. ప్రత్యర్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నా ట్వీట్‌లో పేర్కొన్నారు.