Mahanaadu-Logo-PNG-Large

ఇనుమెళ్లలో వైసీపీ మూకల దాడి దారుణం

` తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి
` బాధిత టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
` నరసరావుపేటలో పరామర్శించిన లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట, మహానాడు : ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, ఆయుధాలతో వైసీపీ మూకలు చేసిన దాడి అరాచకం దారుణమని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఇనిమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండిరచారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవ లు సృష్టించడం బాధాకరమన్నారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారికి, సూత్రధారుల కు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్త లు సీతారామాంజనేయులు, చలమయ్య, నాగార్జున, నాగేశ్వరరావు, కుమారిని గురువారం నరసరావుపేట నెల్లూరి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, అమూల్య ఆసుపత్రులలో పరామ ర్శించారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు ఫోన్లో కోరారు. మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.