హైదరాబాద్, మహానాడు: యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు పెట్టారు. యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.