Mahanaadu-Logo-PNG-Large

కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తా

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తానని, వారికి అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.. ప్రచారంలో భాగంగా 46 డివిజన్ భిమన వారి పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని సుజనాను స్థానికులు కోరారు.

రేషన్ కార్డులు కూడా లేవని వాపోయారు. ఇంతకుముందు ఎవరూ వెళ్ళని విధంగా కొండపై ప్రతి ఇంటికీ సుజనా వెళ్ళారు. అందరి సమస్యలను ఓపికగా విన్నారు. వారి కష్టాలను తెలుసుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, తమను జగన్ విస్మరించారని కొండప్రాంత వాసులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని సుజనా హామీ ఇచ్చారు.. విజయవాడ చరిత్రలో ఇప్పటివరకు కొండ ప్రాంతాల్లో ఏ నాయకుడూ తిరగనంతగా సుజనా ఇంటింటికీ వెళ్తున్నారు. చివరికి జాతీయ మీడియా కూడా సుజనా పర్యటనకు భారీగా ప్రాధాన్యం ఇచ్చింది.