Mahanaadu-Logo-PNG-Large

బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలి

ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు
ఆర్వోపైనా చర్యలు తీసుకోవాలని వినతి

హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను శనివారం బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, ఆశిష్‌ కలిశారు. బీజేపీ అదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, రిటర్నింగ్‌ అధికారి రాజశ్రీ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వివరాలు నింపలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ రిజెక్ట్‌ చేసి రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ అభ్యరి నామినేషన్‌ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించినా పట్టించుకోలేదన్నారు.