Mahanaadu-Logo-PNG-Large

మాఫియా పాలనపై జనంలో తిరుగుబాటు మొదలైంది

జగన్‌ పాలన నుంచి విముక్తి రాబోతోంది
ఫ్యాన్‌ రెక్కలు విరగటం ఖాయం…కూటమి రావటం తథ్యం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సైకో పాలనను తరిమికొట్టి ఓడిరచేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్‌ రెక్కలు విరగడం ఖాయమన్నారు. కరెంటు చార్జీలు, నిత్యావసర సరుకులు పెరిగి ఆర్థిక భారం మోపారని, కూటమి ప్రభుత్వం రాగానే ధరలు తగ్గిస్తామని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు…అభివృద్ధి ఉంటే ప్రజలు మీ పాలనపై ఎందుకు విసుగు చెందుతారని ప్రశ్నించారు.

ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని ఆంధ్రప్రదేశ్‌, సత్తెనపల్లి ప్రజలు ఎదురు చూస్తున్నారు. శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ మాఫియాలు తప్ప ఐదేళ్ల జగన్‌ పాలనలో బాగుపడిరది ఎవరు? అందుకే జనంలో తిరుగుబాటు మొదలైంది…జగన్‌ పాలన నుంచి విముక్తి ఎప్పుడెప్పుడా అని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమ పాలన కావాలా..కూటమి పాలన కావాలో ఆలోచించాలని, కూటమిని గెలిపించుకుని రాష్ట్ర చరిత్రను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.