Mahanaadu-Logo-PNG-Large

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది

ప్రతిపక్ష హోదా పోయినా వైసీపీకి బుద్ధిరాలేదు
వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు

వినుకొండ: నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం యావత్‌ రాష్ట్రం వేయికళ్లతో ఎదురు చూస్తోందని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, లీలావతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మూడోసారి విజయం సాధించిన జీవీని చంద్రబాబు అభినందించా రు. అనంతరం వినుకొండకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజ లు ఈడ్చికొట్టినా ఇప్పటికీ వైకాపా నాయకులు, వారి అధ్యక్షుడు జగన్‌రెడ్డి నిజా యతీగా ఆత్మపరిశీలన చేసుకోకుండా తిరిగి ప్రజలపై నిందలు వేయాలని చూస్తుండడం వారి దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా నోచుకోకుండా మూడవ స్థానానికే పరిమితమైన నేపథ్యంలో వారి కళ్లు నేలకు దిగితే మంచిదన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు పూర్తయిన తర్వాత పోలవరం, అమరావతి పునర్మిర్మాణం, పరిశ్రమలు, పెట్టుబడులకు ఆహ్వానంతో పాటు గడిచిన ఐదేళ్ల దుర్మార్గాలను ఒక్కొక్కటిగా ఆధారాలతో బయటపెట్టి చట్టప్రకారమే వైకాపా దొంగలముఠాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.