జయశంకర్ను స్మరించకుండా ఉండలేం
15 ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ
బీఆర్ఎస్ మహావృక్షం..పార్టీ ఖతం అంత సులువు కాదు
ఎదురుదెబ్బలు తాత్కాలికం..మళ్లీ వస్తాం
ఎగ్జిట్ పోల్స్ గ్యాంబ్లింగ్లా మారాయి..
మహబూబ్నగర్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ గెలిచిందా?
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సందేశం
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు తెలంగాణ భవన్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ హాజరై సందేశం ఇచ్చారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గొప్ప ఉద్వి గ్న క్షణాలివి. తెలంగాణ అని మాట్లాడడమే కష్టంగా ఉన్న రోజులు.. తెలంగాణ అనకూడదని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసిన రోజుల నుంచి నేడీ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశాం. రాజీలేని పోరాటం చేసిన జయ శంకర్ నాతో ఉండేవారు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మేవాళ్లు కూడా ఒక్కోసారి ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి పనిచేయాల్సి వస్తుంది. ఉద్యమంలో తెలంగాణ పరిస్థి తి చూస్తే కన్నీళ్లు వచ్చేవి.
జయశంకర్ను మరువది తెలంగాణ సమాజం
1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారు. తెలంగాణకు జరిగే అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూ వచ్చారు. నాటి ఉద్యమంలో ప్రధానమైన అంశం ముల్కీ రూల్స్. దానిపై ఆనాడు విద్యార్థులు, యువకులు కొట్లాడారు. రాజ్భవన్ గేటు ఎదురుగా బుల్లెట్లు కొడుతుంటే వీళ్లు రాల్లేశారు. చస్తారని తెలిసినా తూటాలకు ఎదురెళ్లారు. రైలు పట్టాల మీద పడి 8, 9 మంది చనిపోయారు. అంత పోరాడినా అప్పుడు తెలంగాణ రాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఈ సమయంలో జయశంకర్ను స్మరిం చుకోకుండా ఉండలేం. ఆయన వంటి మనుషులు అరుదుగా ఉంటారు. తెలం గాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పది. ఏపీ ఏర్పడిన తరువాత కూడా టీఎన్జీవో సంఘం కొనసాగింది. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్ భావించారు.
బతుకమ్మ సినిమా తీద్దామనుకున్నా
బతుకమ్మ అనే సినిమా నేను తీద్దామనుకున్నా..కథ కూడా రాశా. కానీ వాడెవడో తీశాడు.. అందులో ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి రాజ్యాంగ సవరణ చేసినా ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు మీటింగ్లు పెట్టినా పది, పదిహేను మంది కూడా వచ్చేవారు కాదు. పాలమూరులో సభ పెట్టి నేను పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్లు కూడా లేరు. అప్పట్లో కుడి కాలువకు ఫ్రీ, ఎడమ కాలువకు చార్జీలు వసూళ్లు చేసేవాళ్లు. సమైక్యరాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది. అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ చార్జీలు పెంచితే కోపంతో లేఖ రాశా. విద్యుత్ చార్జీలు పెంచితే రైతులు వ్యవసాయం చేయలేరని చెప్పా.
పార్టీని ఖతం చేయడం అంత సులభం కాదు
15 ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ను ఖతం చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ టెంపరరీ సెట్బ్యాక్స్.. మళ్లీ అధికా రంలోకి వస్తాం. 25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయడం అంత సుల భమా? పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది ఖతమైందా? మరలా అధికారంలోకి మనమే వస్తాం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ ప్రజల రక్షణ కోసం. అడ్డగో లు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. అధికారంలో ఉంటేనే రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలు ఏ పాత్రిస్తే అది నిర్వర్తించాలే. ప్రజల ఆకాంక్షల కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ అంటే మహావృక్షం.
ఎదురుదెబ్బలు తాత్కాలికమే…మళ్లీ వస్తాం
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. బస్సు యాత్ర మొదలు పెట్టగానే మళ్లీ అదే గర్జన. ఓట్ల కోసం రైతుబంధు ఇవ్వలేదు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు పంపిణీ చేస్తే అపహాస్యం చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఎదురుదెబ్బలు తాత్కాలికమే.. మళ్లీ అధికారంలోకి వస్తం. లైన్మెన్లను హరీష్రావు పని చేయనివ్వడం లేదని సీఎం రేవంత్ అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి హరీష్రావా?.. రేవంత్రెడ్డా? అని ప్రశ్నించారు. దళిత బం ధు పథకం అతీగతీ లేదని విమర్శించారు.
ఎగ్జిట్ పోల్స్ గ్యాంబ్లింగ్లా మారాయి
ఎగ్జిట్పోల్స్లో బీఆర్ఎస్కు 11 వస్తాయని ఒకరు చెబుతున్నారు. ఒక సీటు వస్తుందని ఒకరు చెబుతున్నారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు..3 సీట్లు వచ్చినా కుంగిపోయేది లేదు. ఎగ్జిట్పోల్స్ ఓ గ్యాంబ్లింగ్లా తయార య్యాయని వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. అక్కడ 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని రేవంత్ ప్రకటిం చారు. 100కు పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచిందని తెలిపారు. నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చింది. రాజకీయ జయా పజయాలు మనకి లెక్క కాదు. ప్రజలకు ఆవేశం వస్తే ఎవరు ఆపినా ఆగరని వ్యాఖ్యానించారు.