ఈ ఇబ్బంది మూడు నెలలే

-గత పాలకులు తవ్వేశారు..
-ఇష్టమొచ్చినట్టు దోచేశారు
-మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కృష్ణాజిల్లాలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఇసుక సరఫరాకు రీచ్ లేకపోవడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై గనుల, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కృష్ణాజిల్లాలో రీచ్ లు లేకపోవటంతోనే కొంత ఇబ్బంది వచ్చిందని, ఇప్పుడు వర్షాకాలం రావడంతో మూడు నెలల పాటు ఇబ్బందులు తప్పవని, మూడు నెలల అనంతరం అన్ని రీచులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజా అవసరాలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం ఇస్టాను సారంగా తవ్వేసి దోచేసిందని… దీంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొల్లు రవీంద్ర వివరించారు.