హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితా లపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమిత మైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథó్యంలో 8 స్థానాలకు చేరు కోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ కృషి ఫలితంగానే సీట్లు సాధించిందని కొనియాడారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్కుమార్ యాదవ్, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, ఫహీం ఖురేషి, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.