హత్రాస్ ఘటనలో 120 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్, మహానాడు : ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా లోని రతిభాన్పూర్లో నిర్వహించిన శివారాధనలో తొక్కిసలాట జరిగి ఇప్పటి వరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 28 మందికి పైగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్ కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.