Mahanaadu-Logo-PNG-Large

వేగేశన సతీమణి ప్రచారం

బాపట్ల, మహానాడు : బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ రాజు సతీమణి హరి కుమారి ఆదివారం పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామంలో విస్తృత ప్రచా రం చేపట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు వెంటరాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు లోకల్‌ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై స్పందిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్ర వర్మ రాజు విజయం సాధించగానే తాగునీరు, సాగునీరు, పంట కాలువల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, వీధి దీపాలు, అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారం చూపుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.