– కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం
– 3 పోర్టులకు కనెక్టివిటీ
– మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి, మహానాడు: అమరావతి రాజధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం… 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చాం.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పడేసిందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో ఏమన్నారంటే… ప్రతీ రాష్ట్ర అభివృద్ధి కి వనరులు, మౌలిక వసతులు ఎంతో అవసరం. సీఎం చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు… ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా 57 కిలోమీటర్ల మేర లైన్ 2245 కోట్లతో నిర్మాణం కానుంది.. ఈ రైల్వే లైన్ వల్ల మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కనెక్టివిటీ అవుతుంది. నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ చెపితే.. సీఎం చంద్రబాబు మూడేళ్ళలో పూర్తి చేయాలని అడిగారు…
అమరావతి కి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నాం.
జగన్ వల్ల అమరావతి రైతులు పడినన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదు. అందుకే రైతుల సమస్యలపైనే ముందుగా దృష్టి సారించాం. గత కాంట్రాక్టులు అన్నీ మరో పదిహేను రోజుల్లో రద్దు చేసి కొత్తవాటిని ఆహ్వానిస్తాం. నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ చివరిలోగా అన్ని పనులకూ టెండర్లు పూర్తి చేస్తాం. 360 కిమీ ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, 3600 ఫ్లాట్లకు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పూర్తిచేస్తాం. అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి జనవరి నెలాఖరుకు టెండర్లు పూర్తి చేస్తాం. సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి డిసెంబర్ నెలాఖరులో టెండర్లు పూర్తి చేస్తాం. కాగా, దాచేపల్లిలో డయేరియా నివారణపై అధికారులతో చర్చించాను. అన్ని బోర్లను మూసివేసి నీటిని పరీక్షలకు పంపించాలని సూచించాను.