Mahanaadu-Logo-PNG-Large

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు

అమరావతి: బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు ఎన్నికయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ… 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అధికారం ఇచ్చిందని తెలిపారు.

2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగించిందని మండిపడ్డారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.