మిమ్మల్ని ఆదుకుంటాం!

– రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం
– బాలిక సోదరుడి చదువు బాధ్యత మాదే
– ఇంటర్‌ విద్యార్థిని తల్లికి సీఎం పరామర్శ

కడప, మహానాడు: బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషయం విదితమే. విద్యార్థిని కుటుంబ సభ్యలతో ఫోన్ లో మాట్లాడి అండగా ఉంటామని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని….అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని, అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు….బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.