Mahanaadu-Logo-PNG-Large

గుడివాడ రూపురేఖలు మారుస్తాం

నవరత్నాలతో మరోసారి మోసపోవద్దు
కూటమితోనే సామాజిక న్యాయం
టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము

గుడివాడ, మహానాడు : గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సహకారంతో గుడివాడ రూపురేఖలు మారుస్తామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రూరల్‌ మండలం పాతమల్లాయిపాలెం లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులో రాముకు ఘన స్వాగతం పలికారు. తమ సాంప్రదాయం ప్రకారం ఆయనను మైనార్టీ పెద్దలు సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్‌ ప్రభుత్వ అసమర్థత, కొడాలి నాని దోపిడీలు, అరాచకాలు, చంద్రబాబు సూపర్‌ 6 పథకాలను వివరించారు. వారికి వీధి వీధినా బ్రహ్మరథం పట్టారు. అనంతరం గ్రామంలోని బాబా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్ధన లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను నమ్ముతున్నారని, నవరత్నాల మోసాలను నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలిపారు.

టీడీపీ అధికా రంలోకి వస్తే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కులగణనతో పాటు స్కిల్‌ గణన కూడా చేయిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. గుడివాడ నియోజ కవర్గానికి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబా బు సహకారంతో గుడివాడ రూపురేఖలు మారుస్తామని తెలిపారు. మారుమూల గ్రామానికి సైతం తాగునీరు, అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయిస్తామని చెప్పారు. రాము ప్రచారంలో టీడీపీ నాయకులు సమ్మెట బ్రహ్మాజీ, సర్దార్‌ బేగ్‌, రషీద్‌ బేగ్‌, ఎం.డి.ఇసా క్‌, హకీమ్‌, బాబర్‌ బేక్‌, సాబీర్‌ ఉల్లా బేగ్‌, అట్లూరి రమణ ప్రసాద్‌, ఎస్‌.కె.ఇబ్రహీం, ఎస్‌.కె. ముజాహుద్దీన్‌, సర్కార్‌, అబ్దుల్‌ సత్తార్‌, జానీ, రఫీ, జబీన్‌, షరీఫ్‌, నూరు అహ్మద్‌, షేక్‌ జానీ భాష, ఎం.డి.నజీర్‌, ఎం.డి.వజీర్‌, షేక్‌ నజీమ్‌, షేక్‌ కాజా, ఎం.డి.యాకోబు, హబీబుల్లా, ఎం.డి.వలి, కదం శ్రీనివాసరావు, ఏసుపాదం, గడ్డం ప్రకాష్‌దాస్‌, వర్రె నాగరాజు, గుడివాడ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.