Mahanaadu-Logo-PNG-Large

రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రూపురేఖలు మారుస్తాం
అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని, రోడ్లన్నీ అస్తవ్యస్తమై అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రూపురేఖ లు మారుస్తామని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గత పది సంవత్సరాలుగా దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. అందుకే ప్రజలందరూ మోదీని మూడోసారి ఎన్నుకున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం జగన్‌ పాలనతో వెనుకబడిరదని, అందుకే ప్రజలు కూటమికి మద్దతు తెలిపా రని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కల సాకారం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం సంతోషకరంగా ఉందని, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపడుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.