– ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల, మహానాడు: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ ఏమన్నారంటే… ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తాం. గత బిఆర్ఎస్ పది యేండ్ల పాలన లో రాష్ట్రం అప్పులపాలు అయ్యింది. వానకు,ఎండలకు రోడ్ల పైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులు ఇబ్బందులు పడే వారు. కానీ, ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండవు.
కూరగాయల మార్కెట్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సోలార్ తోపుడు బండ్లు పంపిణీ చేశాం. ఇక్కడ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం. ఎంపీ నిధుల నుండి బెల్లంపల్లికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు.