హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు?

– పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య పై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి

చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోంది
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? గత నెల 29 న అదృశ్యమైన పాప, నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారు.వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే ఈ హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు?ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా?

పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు.మహిళల, పసిబిడ్డ ల భద్రత కోసం ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అని ప్రత్యేక హెలికాప్టర్ నుa పంపిన ప్రభుత్వం ఫైల్స్ కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా?

ముచ్చుమర్రి ఘటన లోనూ న్యాయం చేయని ప్రభుత్వం ఆవసరమా లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో, ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్ళకు ఉందా? హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లి లో, ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడం తో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడు.

జగన్ మోహన్ రెడ్డి 9 వ తేదీ పుంగనూరు కు వస్తున్నాడని తెలిసి, ప్రభుత్వం, హోం మంత్రి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండి.మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకుని మహిళా రక్షణను పెంచండి. తక్షణం పుంగనూరు ఘటన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా.