Mahanaadu-Logo-PNG-Large

ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల 

అమరావతి , మహానాడు:  స్వలాభం కోసం చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ ను ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు   బీజేపితో సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.

క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? వైయస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే  జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి సంఘీభావం వచ్చిందా అని ప్రశ్నించారు.

మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.
సిద్దం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అని ఎద్దేవా చేశారు.