చిన్నపాటి గొడవలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం
కలెక్టర్తో మాట్లాడి 144 సెక్షన్ సడలిస్తాం
పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ బుధవారం యడ్లపాడు పోలీసు స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడు తూ పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలిపారు. కొంత మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 160 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. అయితే కౌంటింగ్కు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా జరిగేలా చూశామని పేర్కొన్నారు. గెలిచిన వారు ఆనందంలో ఉంటారని, ఓడిపోయిన వారు బాధలో ఉంటారని ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. చిన్నపాటి గొడవలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వరకు చూసి ఎటువంటి గొడవలు లేకపోతే కలెక్టర్తో మాట్లాడి 144 సడలిస్తామని తెలిపారు. లేని పక్షంలో పొడిగిస్తామని వివరించారు.