Mahanaadu-Logo-PNG-Large

వైకాపా ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలు

-చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
-తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు

చిలకలూరిపేట: ఇప్పటికైనా ప్రజలపై నిందలు వేయడం, సాకులు మాని వైకాపా, జగన్‌ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. చంద్రబాబు వంటి అలుపెరుగని పోరాటయోధుడిని అవమానించి, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని ఇంకా గ్రహించలేకపోతే ఎలా అని చురకలు వేశారు. ఆయన గురువారం పార్టీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నుంచి 33 వేలకుపైగా ఓట్లతో గెలుపొందిన ప్రత్తిపాటిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి కార్యకర్తలు, నాయకుల్లో చంద్రబాబు నింపిన స్ఫూర్తే తమను మళ్లీ ఈ స్థాయిలో తలెత్తుకుని నిల్చునేలా చేసిందని తెలిపారు.