విజయవాడ, మహానాడు: భవానీపురం పోలీసుస్టేషన్ నుంచి వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి పరారయ్యారు. పోలింగ్ రోజున టీడీపీ సానుభూతిపరులైన ఎస్సీ మహిళతో పాటు గడ్డం జయచంద్ర అనే యువకుడిపై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడు. ప్రసాద్ రెడ్డిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే స్టేషన్ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.