కుప్పం, మహానాడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ కార్యాలయం శాశ్వతంగా మూతపడనుంది. సరైన నాయకులు లేకపోవడంతో కుప్పం వైసీపీ కార్యాలయం హోటల్ గా మారింది. ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేరు, ఫోన్లు కూడా తీయడం లేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నారా భువనేశ్వరి పర్యటనతో కుప్పంలో వలసలు భారీగా పెరిగాయి. దీంతో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో కలిసి వైసీపీ కౌన్సిలర్లు అమరావతికి బయల్దేరారు. నేడో రేపో కుప్పం మున్సిపాలిటి టీడీపీ కైవసం కానుంది.