ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం

– యువతకు ఎమ్మెల్యీ జీవీ పిలుపు

వినుకొండ, మహానాడు: త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కొట్టే దెబ్బకు మళ్లీ వైసీపీ లేవకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ లాంటి నియంత కొమ్ములు వంచిన యువతరం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కోరారు. ఉద్యోగాల్లేకుండా, ఉపాధి లేకుండా అయిదేళ్ల పాటు సాగించిన విధ్వంసపు పాలనను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరు ఓట్లు నమోదు చేసుకుని మార్పును బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలించాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు సంబంధించిన దరఖాస్తులను గురువారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు పరిశీలకులుగా పార్టీ నాయకులు పంచుమట్టి భూపతిరావు, పాములపాడు శ్రీనివాసరావు, నల్లబోతు శ్రీనివాసరావు, రఘురావు నాయుడు, సైదారావు, రాంకోటేశ్వరరావును నియమించారు.

పార్టీ స్థానిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఓటు నమోదు దరఖాస్తులను అందజేశారు. బీజేపీ నాయకులు యార్లగడ్డ లెనిన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, శావల్యాపురం, వినుకొండ రూరల్ మండలాల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు, మాదినేని ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.