వ్యవసాయ కూలీలతో పెమ్మసాని మాటామంతీ

అధికారంలోకి వస్తే ఇళ్లు కట్టిస్తామని హామీ తుళ్లూరు, మహానాడు: తుళ్లూరు మండల పర్యటనలో భాగంగా సోమవారం పరిమి గ్రామంలో పంట పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను కలుసుకుని పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడారు. కూలీల సమస్యలను, పని సమయం, రోజువారి కూలీ వివరాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారి కూలీలతో జీవనం దుర్భరం గా మారిందని, ఇంట్లోని మగవాళ్లు కల్తీ మద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా కొందరు […]

Read More

జగన్ రెడ్డితో వారి కుటుంబ సభ్యలకు ప్రాణ హాణి

-జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా -ప్రీ ప్లాన్ తో సింపతి కోసమే రాయి దాడి డ్రామా -రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్  సజ్జల -భయపడి విదేశాలకు పారిపోయిన విజయమ్మ -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని.. రాయి దాడి డ్రామాకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జల చేశారని.. ప్రీ ప్లాన్ తో సింపతి కోసమే ఈ […]

Read More

ఓటమి భయంతో వైసీపీ గ్యాంగ్‌ దాడులు

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, ఎన్నికలు సజావుగా జరగకుండా ఓటర్లను భయభ్రాంతులను గురిచేసేందుకు వైసీపీ కుట్రలో భాగమే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై రాళ్ల దాడులని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గాజువాకలో చంద్రబాబు ప్రచార కార్యక్రమంలో రాళ్లతో దాడి చేయడం, తెనాలిలో పవన్‌ కళ్యాణ్‌పై రాళ్ల దాడికి యత్నించడం హేయమైన చర్యగా […]

Read More

గుంటూరు పశ్చిమలో టీడీపీ గెలుపు ఖాయం

-ఎన్నికల పరిశీలకుడు మల్లెల రాజేష్‌నాయుడు గ-ల్లా మాధవితో సమావేశం గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమాన మరోసారి టీడీపీ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మల్లెల రాజేష్‌నా యుడు పేర్కొన్నారు. టీడీపీ గుంటూరు పశ్చిమ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన మల్లెల రాజేష్‌నాయుడును పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేష్‌నాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా […]

Read More

రైతులకు కాంగ్రెస్‌ వెన్నుపోటు

-హామీలు తక్షణమే అమలు చేయాలి -బోగస్‌ డిక్లరేషన్‌, గ్యారంటీలతో కాలం గడపొద్దు -రాష్ట్రంలో మరో వసూలు రాజ్యం వచ్చింది -కిషన్‌రెడ్డి రైతు దీక్షలు ప్రారంభం హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయ డాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో […]

Read More

దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ

-గాంధీ కుటుంబంలా త్యాగాలు చేశారా? -పదేళ్లలో అప్పులను రెట్టింపు చేశారు -దేవుడి పేరుతో రాజకీయం మానుకోండి -15 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం -తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హైదరాబాద్‌, మహానాడు: దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ విలువలతో రాజకీయాలు చేస్తుందని, రాహుల్‌ గాంధీ కుటుంబం […]

Read More

బీజేపీ మేనిఫెస్టోతో ఆంధ్రప్రదేశ్‌ కు మేలు

-వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం -రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల సమన్వయ కర్త పేరాల చంద్రశేఖర్‌ మాట్లాడారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేకూర్చనుందని వివరించారు. దేశంలో 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం, పేదలకు సొంతంటి కల బీజేపీతోనే సాధ్యమన్నారు. కుల వృత్తులు, రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి మేలు […]

Read More

‘అన్న’కు అప్పుడే అభిమానులే అండ

అన్న తారకరాముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి, చైతన్యరథం ఎక్కినప్పుడు ఆయన వెంట తెలుగుప్రజలు లక్షలాదిగా నడిచారు. వందలు.. వేలు.. లక్షల సంఖ్యలో జనవాహిని. తెలుగుదేశం పిలుస్తోంది. రా. కదలిరా అన్న ఆయన పిలుపే ఒక ప్రభంజనం. అయినా ఇప్పటిలా అప్పట్లో వంద ల సంఖ్యలో పోలీసుల భద్రత లేదు. ఒక ఎస్‌ఐ, ఐదారుగురు కానిస్టేబుళ్లు చైతన్యరథం చుట్టూ ఉండేవారు. ఉన్నదల్లా అన్నగారి అభిమానులు, అభిమానసంఘ నేతలే. వారే అన్నగారికి ‘రక్ష’ణ. […]

Read More

లిక్కర్‌ మంత్రీ…ఈ పాపం నీది కాదా?

-అంబేద్కర్‌ వారసుడివి అయితే…కల్తీ మద్యంతో జనాలను చంపుతావా? -కాంట్రాక్టర్లకు మీరే బినామీ అంటగా… -నియోజకవర్గంలో హామీలు ఏమయ్యాయి? -షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారట..ఏమైంది? -నారాయణస్వామిపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌ -కాంగ్రెస్‌ వస్తే షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే […]

Read More

డీజీపీ, ఏడీజీ, సీపీలను బదిలీ చేయరా?

-బాధ్యులైన వారితోనే విచారణ జరిపిస్తారా? -సూత్రధారులెవరన్నది ఎలా తేలుతుంది? -సచ్చీలుడైన అధికారికి జగన్ రాయి కేసు ఇవ్వండి -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి […]

Read More