బాపట్లలో అశేష జనవాహినితో భారీ ర్యాలీ విజయోత్సవ వేడుకలను తలపించిన నామినేషన్ కూటమి ప్రభంజనంతో అధికార పార్టీలో వణుకు బాపట్ల, మహానాడు : బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ మంగళవారం నామినేషన్ సందర్భంగా పసుపు దండు కదంతొక్కింది. నామినేషన్కు ముందు భారీ ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలో జగన్ పాలనలో విసిగిపోయి మార్పు కోరుకుంటున్న ప్రజానీకం ఈ భారీ ర్యాలీలో భాగస్వాములై అభిమానాన్ని చాటుకున్నారు. పల్లెల నుంచి వేలాదిగా ప్రజలు […]
Read Moreభజనపరుల ఓవరాక్షన్ జగన్కే ప్రమాదం
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి అధికారి సలహాదారుల ఆలోచనలో, సూత్రధారుల ఆలోచనలో తెలియదు కానీ చేటు తెచ్చేది మాత్రం నాయకుడికే. అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, చిన్నాన్న మర్డర్ కేసు కావచ్చు, కోడి కత్తి డ్రామా కావచ్చు, అమరావతి రైతుల ఆక్రందన కావచ్చు, రాజధాని లేకపోవడం కావచ్చు, నిర్మాణంలో ఉన్న రాజధానిని కొనసాగించకపోవడం కావచ్చు, మీరు చెప్పిన మూడు రాజధానుల ఊసే లేకపోవడం కావచ్చు, కేంద్రం ఇచ్చిన […]
Read Moreచంద్రబాబుపై చర్యలు తీసుకోండి
ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ ఫిర్యాదు వెలగపూడి సచివాలయం, మహానాడు : ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారం టూ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనాకు మంగళవారం వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ శ్రీనివాసరెడ్డి అందుకు సంబంధించి తగిన ఆధారాలను అందజేశారు. ఈనెల 22న చంద్రబాబు జగ్గంపేట బహిరంగసభలో జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలపై […]
Read Moreఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడుతా
ప్రజాసేవకు వారెప్పుడూ ముందుంటారు వారి రక్షణ కోసం అట్రాసిటీ తరహా చట్టాలు అవసరం సంఘం ప్రతినిధులతో జనసేన అధినేత పవన్కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ తర్వాత సామాజికవర్గాలతో భేటీలు ఇల్లు పూర్తయ్యాక అందరికీ అందుబాటులో ఉంటానని హామీ వర్మను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తనదని వెల్లడి పిఠాపురం, మహానాడు : జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ మంగళవారం పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వివిధ సామాజికవర్గాల వారితో సమావేశమయ్యారు. పిఠాపురం […]
Read Moreతాగునీటి సమస్యను పరిష్కరించాలి
సుజనా తనయుడు కార్తీక్ కు స్థానికుల మొర అన్ని సమస్యలకూ మా తండ్రి గెలుపుతోనే పరిష్కారం-కార్తీక్ ఫ్రైజరు పేటలో తండ్రి కోసం తనయుడు కార్తీక్ ప్రచారం ఓవైపు తండ్రి, మరోవైపు తనయుడు, ఇంకోవైపు సోదరి… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా కుటుంబం సుడిగాలి ప్రచారం చేస్తోంది. మంగళవారం సుజనా తనయుడు కార్తీక్ 49వ డివిజన్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కార్తీక్ […]
Read Moreపద్మశాలీలకు అండగా ఉంటా
చేనేతను ప్రోత్సహిస్తా మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పద్మశాలీల సంక్షేమం కోసం చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం పద్మశాలీ సంఘీయుల ఆత్మీయ సమావేశం భవానీపురం ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా […]
Read Moreకేసీఆర్ బస్సు యాత్ర సిద్ధం
-మే నెల 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర -ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్ షో లు -గులాబీ రథానికి ప్రత్యేక పూజలు హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది.ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించ బోయే బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా […]
Read Moreఎమ్మెల్సీ కవిత.. మళ్లీ తీహార్ జైలుకు!
ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్ సి కవిత జ్యుడీషియల్ కస్ట డీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7వరకు పొడిగించింది. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ […]
Read Moreగగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ
మలేసియాలో ఘోర ప్రమాదం మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్లోని లుమత్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం […]
Read Moreపాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు
-నేడు అన్ని పాలిటెక్నిక్ లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ -సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్ – 2024“ సన్నాహక, సన్నద్దత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య , శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. […]
Read More