ఏపీలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

అమరావతి, మహానాడు: గత ఏడాది ఖరీఫ్‌ కరువు, మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.1,289 కోట్ల విలువైన ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించేందుకు ఈ ఏడాది మార్చి 6న సీఎం జగన్‌ బటన్‌ను నొక్కారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికలు ముగిసే వరకు చెల్లింపులు వాయిదా వేయాలని ఆదేశిం […]

Read More

కుల రాజధాని..వెదవలను ఏ చెప్పుతో కొట్టాలి?

అమరావతి, మహానాడు: హైదరాబాద్‌ మెట్రోలో అమరావతి అమృతా యూనివర్సిటీ యాడ్‌ ఇది. ఇక్కడేమో అది కుల రాజధాని అని తినే కంచంలో మన్ను పోసుకున్నారు అంధులు. జాతీయస్థాయిలో 7వ స్థానంలో ఉన్న అమృతా యూనివర్సిటీ అమరావతిలో టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, ఐబీఎం, హెచ్‌సీఎల్‌ వంటి ఎంఎన్‌సీలలో లక్షల్లో జీతాలతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఇస్తున్నాయి. ఈ యూనివర్సిటీకి విద్యా ప్రమాణాలలో ఏ మాత్రం తగ్గని ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు కూడా అమరావతిలో […]

Read More

అవే పిన్‌లతో సైబర్‌ నేరగాళ్లకు అవకాశం

హైదరాబాద్‌: భారత్‌లో అధికశాతం ప్రజలు 1234, 1111, 0000, 9999 వంటి పాస్‌వర్డ్‌లనే పిన్‌లుగా పెట్టుకుంటున్నట్లు చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ చేసిన సర్వేలో వెల్లడైం ది. దీంతో సైబర్‌ నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్‌ చేయగలుగుతున్నారని ఈ నివేదికలో పేర్కొంది. పుట్టిన తేదీ, బైక్‌ లేదా కార్‌ నెంబరు లేక లక్కీ నెంబర్‌నో పిన్‌ గా పెట్టుకోవడమంటే సైబర్‌ నేరస్థులను తక్కువ అంచనా వేయడమేనని హెచ్చరించింది.

Read More

కూటమికి భారీ మెజార్టీ: నందమూరి రామకృష్ణ

అమరావతి, మహానాడు: తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటింగ్‌ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు… పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారు తరలివచ్చి ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు..ఇది తథ్యమని స్పష్టం […]

Read More

వికారాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల ఆస్తినష్టం హైదరాబాద్‌, మహానాడు: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్య గూడా రోడ్డు దానప్ప ఆసుపత్రి పక్కన ఉన్న నాగలక్ష్మి హార్డ్‌వేర్‌ షాపులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఉదయం 4 గంటల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక సీఐ నాగరాజు పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మున్సిప ల్‌ చైర్మన్‌ మంజుల రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మున్సిపల్‌ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. […]

Read More

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

20 నుంచి సబ్సిడీపై విత్తనాలు అమరావతి, మహానాడు ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఈ నెల 20 నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇందుకు రూ.450 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం రూ.195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం […]

Read More

మెడిసిన్స్‌ ధరలు తగ్గించిన కేంద్రం

హైదరాబాద్‌: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయో గించే 42 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. యాంటిసిడ్స్‌, మల్టీ విటమిన్‌, యాంటీ బయాటిక్స్‌ ధరలను తగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్ల మందికి పైగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు లబ్ధిపొందనున్నారు. ప్రపంచం లోనే అత్యధిక మంది షుగర్‌ […]

Read More

తిరుమలను దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు

వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితమని వ్యాఖ్య తిరుపతి, మహానాడు: ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానం తరం అయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని, వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితమవుతుందని […]

Read More

భారత్‌లో పెరుగుతున్న గుండెపోటు మరణాలు

భారత్‌లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సంభవించే గుండెపోటు మరణాలకు మొద టి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్‌, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి […]

Read More

జూన్‌ 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

జమ్మూకశ్మీర్‌, మహానాడు: జమ్మూకశ్మీర్‌లో ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పిలుపునిచ్చారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో […]

Read More