తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్రస్తుతం భారత్లో నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద బంగాళాఖాతం తీరంలో మాత్రమే రాకెట్ ప్రయోగ కేంద్రం అందుబాటులో ఉంది.
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఎందుకు అరెస్టు చేయలేదు?
డీజీపీని కలిసి నిలదీసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు శనివారం డీజీపీని కలిసి నిలదీశారు. తక్షణమే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. డబ్బుల రవాణా కోసం ఎస్సై సారా సాయికిరణ్ను వెంకటరామిరెడ్డి నియ మించినట్లు మార్చి 29న […]
Read Moreమాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటిలిజెన్స్ సీతారామాంజనేయులు, ఐజి కొల్లి రఘురామరెడ్డి ఫోన్ కాల్ డేటా పరిశీలించాలి
• టీడీపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోలీసు అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ పన్నిన కుట్రను కూడా సిట్ వెలికి తీయాలి • మాచర్లలో పోలింగ్ సందర్భంలో అరాచకం సృష్టించి రక్తపాతానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పిన్నెళ్లి అతని తమ్ముడు వెంకట రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి • టీడీపీ నేత నానిపై హత్యాయత్నానికి కారకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి […]
Read Moreఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హతం
ఖమ్మం జిల్లాలో గోపాలపేటలో దారుణం ఖమ్మం, మహానాడు : ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య చేసిన కసాయి ఉదంతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), రaాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయా […]
Read Moreజూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అనుమతి ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులు హైదరాబాద్ : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన పంపిణీదారు బత్తిన కుటుంబం కీలక ప్రకట న చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా జూన్ 8 నుంచి ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించా రు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని […]
Read Moreఅంబేద్కర్ కి మోదీ పూజలు
ప్రధాని మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు.
Read Moreఅప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభం
సింహాచలం అప్పన్న దేవాలయంలో రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తితో కలిసి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలని, రెండున్నర గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం కాలుష్యాన్ని తగ్గించేందుకు రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని అశోక్ గజపతిరాజు తెలిపారు.
Read Moreఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.మే 24 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read Moreమూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియమాకం
అమరావతి: పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమి శాలిని నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Moreమేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం
హైదరాబాద్: మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం లో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపు ణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ పనుల ను ప్రారం భించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ […]
Read More