తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచనలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23 వరకు అతిభారీ వర్షాలు వాతావ రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, […]

Read More

బోనస్‌ను బోగస్‌గా మార్చకండి

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి జూన్‌ మొదటివారంలో రైతుబంధు విడుదల చేయాలి ఆరు నెలల పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు తిట్లు మాని కేబినెట్‌లో మంచి నిర్ణయాలు తీసుకోండి బీఆర్‌ఎస్‌ నేత బి.వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌, మహానాడు : ఆరునెలలో పాలనలో చెప్పుకోవడానికి రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

ఈఏపీ సెట్‌ మొదటిసారి నిర్వహించాం

-త్వరలో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల -విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ఈఏపీ సెట్‌ మొదటిసారి నిర్వహించినట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల అనంత రం ఆయన మాట్లాడారు. గత ఏడాది వరకు ఎంసెట్‌ పేరు మీద పరీక్షలు జరిగేవన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లో 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా 91,633 మంది, ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో […]

Read More

ఎన్నికల హింసపై ఈసీకి ప్రాథమిక నివేదిక

-కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం -స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌కు మూడంచెల భద్రత -క్షేత్రస్థాయి పర్యటనలకు సీఈవో మీనా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సీఈవో కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించనుంది. […]

Read More

1986లో ఎక్కడున్నావు మోదీ?

-కాంగ్రెస్‌ హయాంలోనే రామమందిరం తెరిచింది -రామరాజ్యం స్ఫూర్తిగా రాజీవ్‌గాంధీ పాలన -ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు: గాంధీభవన్‌లో శనివారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సిన ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. దేశంలో ప్రార్థన మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామ్‌ లల్లా మీద బుల్డోజర్‌ తీసుకువస్తారని ప్రచారం […]

Read More

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్‌: నగరంలో మెట్రో రైళ్లకు సంబంధించి ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంట లకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయి. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. […]

Read More

తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల

-మొత్తం 2,62,587 మంది అర్హత -ఏపీ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించి న ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 2,62,587 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో 74.98 శాతం, అగ్రికల్చ ర్‌, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో 89.66 శాతం అర్హత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన విద్యార్థులు సమానంగా […]

Read More

ఎవరెస్ట్‌పై ఎగిరింది పసుపు జెండా

81 ఏళ్ల వయసులో వృద్ధుడి రికార్డ్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను 81 ఏళ్ల వయసులో అధిరోహించి తెలుగుదేశం జెండాను ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్నాడు ప్రత్తిపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శివప్రసాద్‌. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన అత్యంత పెద్ద వయ స్కుడిగా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అభినందించారు.

Read More

సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని శుక్ర వారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీష్‌రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

పవిత్ర మరణంతో చంద్రకాంత్​ ఆత్మహత్య

పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, రోడ్డు ప్రమాద రూపంలో పవిత్ర చనిపోవడంతో.. చంద్రకాంత్​ తట్టుకోలేకపోయాడు. అయితే చంద్ర కాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరామ్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం […]

Read More