రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతోంది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వస్తానని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. […]
Read More‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ‘ఏసీఈ’ ఫస్ట్ లుక్
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్కుమార్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు, ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్. ‘ఏసీఈ’ అనే డిఫరెంట్ […]
Read Moreహౌస్ అరెస్టులో పిన్నెల్లి ఎలా పరారయ్యారు
తెలుగుయువత నేత గోళ్ల సురేష్యాదవ్ పల్నాడు జిల్లా, మహానాడు: హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా పరారయ్యారని జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం కారంపూడిలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు తప్పించుకోవడానికి కొంతమంది పోలీసు అధికారులు సహకరించారన్నారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు […]
Read Moreడీజీపీకి వర్ల రామయ్య లేఖ
మంగళగిరి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘనటలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. హింసకు పాల్పడిన వారిపై ఐపీసీ, ఇతర చట్టబద్ధమైన కేసులతో ఎఫ్ఆర్ నమోదు చేయాలి. ఎన్నికల నాడు, […]
Read Moreస్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతా చర్యలు చేపట్టండి
ఎన్నికల కమిషన్, డీజీపీకి దేవినేని ఉమ లేఖ మంగళగిరి, మహానాడు: స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా రిటర్నింగ్ అధికారులకు దిశానిర్ధేశం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా, డీజీపీలకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతకు సంబంధించి తమ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. […]
Read Moreఏపీలో అల్లర్లపై సిట్
-వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మందితో ఏర్పాటు -ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం -విచారణ తర్వాత నివేదిక ఇవ్వనున్న బృందం అమరావతి, మహానాడు రాష్ట్రం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సం బంధించి పోలీసులపై విచారణకు వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ సభ్యు లుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ […]
Read Moreనిరాధార వార్తలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు
పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) ఆర్.రాఘవేంద్ర నరసరావుపేట, మహానాడు: పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజున, తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నిరాధార, అబద్ధపు సమాచారం ప్రసారం చేసిన వారిపై చట్టపరపమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) ఆర్.రాఘవేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అబద్ధపు ప్రచారాలు, ట్రోలింగ్లను తీవ్రంగా పరిగణిస్తామని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, […]
Read Moreముబారక్.. నాయుడు గారు!
ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలసి అభినందించిన ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించి, మరోసారి చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.
Read More