అరుణాచల్ ప్రదేశ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. సిక్కిం పీఠం మరోసారి క్రాంతికారీ మోర్చాదే!

ఢిల్లీ: సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. భారత ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 60 స్థానాలకు గాను 17 స్థానాలను గెలుచుకుంది. అంతకుముందు 10 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. ప్రస్తుతం 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిక్కింలో  ఏడు స్థానాలను గెలుచుకుంది. 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. […]

Read More

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, పలు పార్టీల జాతీయ స్థాయి నేతలు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ .. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. […]

Read More

ఈరోజు 7 కీలక సమావేశాలు నిర్వహించనున్న ప్రధాని మోడీ..

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది. ఇటీవలి తుఫాను గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. తక్షణ అంచనా, సమన్వయ సహాయక చర్యలు అవసరం. అలాగే.. […]

Read More

ఔరా..! ‘ఆరా’ సర్వేలో ఎన్ని సిత్రాలో…

నిన్నటిదాకా ఎగ్జిట్ పోల్స్ ఎదురు చూపులు…తీరా అవి వచ్చాక వాటి విశ్వసనీయత మీద వాదోపవాదాలు…ఇదీ కౌంటింగ్ ఫీవర్ తీవ్రంగా ఆవరించి ఉన్న ఏపీలో పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ ఆరా అనే సంస్థ ఇచ్చిన సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేంటో…ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఎపిలో ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న వేళ ముందుగా ప్రజానాడిని పసిగట్టే ఎగ్జిట్ పోల్స్ […]

Read More

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. యువత కోరుకున్నట్టుగా బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. […]

Read More

నేడు తీహార్ జైలుకు వెళ్లనున్న ఢిల్లీ సీఎం..!

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట […]

Read More

నేనేం తప్పు చేయలేదు.. సిట్ ప్రశ్నలను తప్పించుకుంటున్న ప్రజ్వల్ రేవణ్ణ

సెక్స్ స్కాండల్ కేసులో జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేతృత్వంలో అతన్ని విచారిస్తున్నారు. 6 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్.. ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని.. వరుసగా రెండు రోజుల పాటు సిట్‌ ప్రశ్నలకు రేవణ్ణ తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ కేసు తనపై […]

Read More

పల్నాడులో నేటి నుండి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్..

పల్నాడులో నేటి నుండి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను, అష్టదిగ్బంధం చేయనున్నారు పోలీసులు.. జూన్ 4న కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులందరి ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని.. పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతించబోమని పల్నాడు జిల్లా పోలీసు […]

Read More

అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ఎవరున్నారంటే?

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే, నేటితో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలకు గాను 10 చోట్ల […]

Read More

ప‌రేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను […]

Read More