తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో, బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే […]
Read Moreప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన
పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలిన మోడీ.
Read Moreనిజాం రాజు ను పొగుడుతున్న వాళ్ళను కట్టేసి”రజాకార్” సినిమా చూపించాలి
– ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నిజాం తరహా పాలన రాకూడదని అనుకునే వాళ్లంతా కచ్చితంగా “రజాకార్” సినిమా చూడాలి. మతపరంగా “ముస్లిం”లకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునే వాళ్లంతా ఈ సినిమా చూసి బుద్ది తెచ్చుకోవాలి. చాకలి ఐలమ్మ తెగువ, గుండ్రంపల్లి పోరాటాల ను కళ్ళకు కట్టినట్లు రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా […]
Read Moreనా జీవితంలో ఎప్పుడూ ఇంత జనాన్ని చూడలేదు
ప్రజాగళం సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నా జీవితంలో ఎప్పుడూ ఇంత జనాన్ని చూడలేదు. జగన్ అరాచకపాలనపై ఎంతవ్యతిరేకత ఉందో జనసంద్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ప్రజాగళం సభతో జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి విరగడ కాబోతోంది. రాబోయే ప్రజాప్రభుత్వం 5కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది.
Read Moreఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే
– ప్రజాగళం సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇది మరో కురుక్షేత్ర యుద్ధం, అయిదేళ్ల అరాచకపాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడింది. 2014లో గుంటూరు సభను నేనే పర్యవేక్షించా, మళ్లీ 2024లో కూడా సభా నిర్వహణ బాధ్యత నాకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా. కూటమి తిరుగులేని విజయానికి బొప్పూడి సభ సూచికగా నిలవబోతోంది. బొప్పూడి ఆంజనేయస్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే.
Read Moreఅరాచక పాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదు
ప్రజాగళం సభలో టిడిపి మాజీమంత్రి కొల్లు రవీంద్ర అయిదేళ్ల అరాచకపాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదు. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమే బిజెపి, టిడిపి, జనసేన కూటమి ఏర్పాటు. కూటమి పంతం, వైసిపి పాలన అంతం… ఈ నినాదంతోనే ముందుకెళ్తాం.
Read Moreఅయిదేళ్లలో ఎపిలో అభివృద్ధి శూన్యం
ప్రజాగళం సభలో బిజెపి సీనియర్ నేత జివిఎల్ నరసింహరావు దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారు. గత అయిదేళ్లలో ఎపిలో అభివృద్ధి శూన్యం, కేంద్రం సహకారంతోనే కొద్దిపాటి అభివృద్ధి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి ఎన్ డిఎ కూటమి ద్వారా మాత్రమే సాధ్యం.
Read Moreప్రజాగళం అయిదుకోట్లమంది ఆంధ్రుల గళం
ప్రజాగళం సభలో టిడిపి సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ప్రసంగం ప్రజాగళం అయిదుకోట్లమంది ఆంధ్రుల గళం. జగన్ కు చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, ఇంకొక చాన్సిస్తే రాష్ట్రాన్నే లేకుండా చేస్తారు. అయిదుకోట్లమంది ఆంధ్రుల భవిష్యత్ కోసమే ప్రజాగళం. మూడు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కలసికట్టుగా పనిచేయాలి.
Read Moreఅయిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లే
ప్రజాగళం సభలో జనసేన సీనియర్ నేత బొమ్మిడి నాయకర్ ప్రసంగం అయిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని నిలిపిన ఘనత దుర్మార్గపు జగన్ ది. ఎన్డీఎ కూటమి ద్వారానే రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందబోతోంది.
Read Moreవైసిపి పాలకులకు తగిన గుణపాఠం తప్పదు
ప్రజాగళం సభలో రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ ప్రసంగం జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించడానికి టిడిపి-జనసేన-బిజెపి కూటమి. ల్యాండ్, శ్యాండ్,వైన్, మైన్ ద్వారా జగన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. దోపిడీదారులకు సహకరించిన ఏ ఒక్కరినీ కూటమి వదలదు. జూన్ 4వతేదీ కౌంటింగ్ తర్వాత దేశానికి 3వసారి ప్రధానిగా మోడీ, ఎపిలో చంద్రబాబు సిఎంగా ప్రమాణం చేస్తారు. కూటమి కార్యకర్తలను […]
Read More