రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు గుంటూరు, మహానాడు : ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువ్వుకున్నానని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు గుంటూరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకునేవాడినన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులందరూ జవాబుదారీతనంగా ఉండేలా చూస్తామన్నారు. […]
Read Moreకూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు
-పొరపొచ్చాలకు తావివ్వొద్దు -ఈ మైత్రి ఇలాగే కొనసాగాలి -జనసేన అధినేత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుని ఆత్మీయ సమావేశం అమరావతి, మహానాడు : జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు వెళ్లిన పల్లా శ్రీనివాసరావుతో గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ […]
Read Moreప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షర యోధుడు రామోజీరావు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధుడు రామోజీరావు అని నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షర యోధులు రామోజీరావు […]
Read Moreకాంగ్రెస్ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
హైదరాబాద్, మహానాడు : అవినీతి సంపాదనతో ఆనాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీ నేత […]
Read Moreభారీ వర్షాలతో ఛార్ ధామ్ యాత్రకు బ్రేక్
ఉత్తరాఖండ్, మహానాడు : దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా అక్కడ వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఛార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే పేర్కొన్నారు.
Read Moreపెనుభూతంలా ప్లాస్టిక్
– పారిశుద్ధ్య నిర్వహణ అతిపెద్ద సమస్యగా ఎందుకు మారిపోయింది? జనాభా పెరుగుదల అనేది పైకి కనిపిసున్న అంశం. కానీ… పైకి కనపడని అంశం ప్లాస్టిక్ వినియోగం. నానాటికీ పెరిగిపోతున్న జనాభా కి కావలసిన నిత్యావసర వస్తువుల నుండి పెళ్లిళ్లు, ఫంక్షన్ల వరకూ ప్రతీదీ ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది. కూరగాయలు అమ్మేచోట ప్లాసిక్ కవర్స్, కర్రీ పాయింట్ దగ్గర ప్లాస్టిక్ కవర్స్, కిరాణా కొట్టు లో ప్లాస్టిక్ కవర్స్, షాపింగ్ మాల్స్ […]
Read Moreఓటమిని తట్టుకోలేక నా హత్యకు కుట్ర
-కాటసానిపై టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఫిర్యాదు -మాజీ ఎమ్మెల్యే కాటసానిపై జిల్లా ఎస్పీకి నంద్యాల టీడీపీ అధ్యక్షుడి ఫిర్యాదు -తన కుమారుడు, అనుచరులతో కలిసి హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ -ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం -టీడీపీ అభ్యర్థి విజయం కోసం తాను పాటుపడ్డందుకు ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్య పాణ్యం: పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరులు తనను హత్య చేసేందుకు కుట్ర […]
Read Moreఈ దొంగకు ఆడి కారు.. కోటి రూపాయల ఫ్లాట్
విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన హోటళ్లలో బస గాంధీనగర్: గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. రోహిత్ను వివిధ రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించారు. ఇందులో తెలంగాణాలో రెండు, ఆంధ్రప్రదేశ్లో రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ముంబయిలో నిందితుడికి కోటి రూపాయలకు పైగా విలువచేసే ఫ్లాటు, […]
Read Moreఇది కీలక ముందడుగు
– ముఖ్యమంత్రుల సమావేశంపై వెంకయ్యనాయుడు స్పందన అమరావతి: హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం శుభపరిణామం అని అభివర్ణించారు. ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల […]
Read Moreపాతికమంది దివ్వాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్
-ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు -జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు -రాజకీయ నేతలపై గౌరవం పెరిగిందంటున్న దివ్యాంగ విద్యార్థులు అమరావతి: అధికారమిచ్చింది ప్రజలకు సేవ చేయడానికే గానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి…ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు […]
Read More