– త్వరలో చౌక దుకాణాల్లో ఖాళీల భర్తీ – పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీసర్) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా […]
Read Moreరాష్ట్రానికి శనిలా దాపురించారు
* ఐదేళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు * పదవి పోయాక నీతులు చెబుతూ డ్రామాలాడుతున్నారు * గత ఐదేళ్ల పాలనలో జరిగిన హింసకు పేర్ని నాని సమాధానం చెప్పాలి * వైసీపీ నేతలంతా కలిసి రాష్ట్ర మంతా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరు – గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ: వెయ్యి గొడ్లను తిన్న రాబందు నీతులు చెప్పినట్లుంది […]
Read Moreభారత్కు చేరుకున్న షేక్ హసీనా
– విమానాన్ని అనుసరించిన భారత వాయుసేన ఫైటర్ జెట్ – సాయంత్రం 5.30 గంటలకు భారత్కు చేరుకున్న షేక్ హాసీనా – షేక్ హసీనా విమానాన్ని అనుసరించిన వాయుసేన ఫైటర్ జెట్స్ – భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం – ఢాకాకు ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్కు చేరుకున్నారు. […]
Read Moreజయశంకర్ కలలు కన్న ప్రజా తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యం
– మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న ప్రజా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాడిన తీరును మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రజల్లో రగిలించి, తెలంగాణ […]
Read Moreముగిసిన టెట్ దరఖాస్తుల స్వీకరణ
– పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ […]
Read Moreయర్రగొండపాలెం గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన టీడీపీ ఇంచార్జ్!
యర్రగొండపాలెం, మహానాడు: యర్రగొండపాలెం పట్టణంలోని గురుకుల పాఠశాలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం మీడియాలో ప్రచురించిన కథనాలకు స్పందించి, నిజనిర్ధారణ కోసం ఆయన పూనుకొన్నారు. సంఘటనపై విద్యార్థులు, వార్డెన్, ప్రిన్సిపాల్, వాచ్ మెన్, ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఓ వైసీపీ మీడియా ప్రతినిధి వార్డెన్ కి డబ్బు అడగటంతో సయోధ్యకు రాని వార్డెన్ పై అబద్దపు నింద వేయాలనే […]
Read Moreషేక్ హసీనా బెడ్డుపై పడుకొని ఆందోళనకారుల నిరసన
ఢాకా: బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ వచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఆందోళనకారులు ఢాకాలోని ప్రధాని నివాసంలోని ఆమె రూమ్ లోకి వెళ్లి వీడియోలు తీసుకున్నారు.ఆమె సేదతీరే బెడ్డు ఇదేనంటూ దానిపై పడుకొని నిరసన తెలిపారు.దీంతోపాటు ఇంట్లోని చీరలు, పాత్రలు దొంగిలించారు. కిచెన్ లోకి చొరబడి అక్కడున్న ఆహారాన్ని తింటున్న వీడియోలను షేర్ చేశారు.
Read Moreపాడైన పైరుకి పరిహారం : ఎమ్మెల్యే యరపతినేతి
పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆకుముడత, పంట ఎండిపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో […]
Read Moreపేటలో పరిశుభ్రతకు పెద్దపీట
– ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ఐదేళ్ల పాటు పడకేసిన పారిశుద్ధ్యంపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు యుద్ధం ప్రకటించారు. పొద్దున్న లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు వరకు ప్రజల్లోనే ఉంటూ సమస్య అనే మాట లేకుండా చేసేందుకు తపిస్తున్నారు. స్వయంగా ఫాగింగ్ యంత్రాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగింపజేశారు. డీవార్మింగ్ స్ప్రే చేశారు. వర్షంలోనూ 8, 11, 21, 29,30 […]
Read Moreహైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్
10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం హైదరాబాద్ : ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది […]
Read More